రాప్తాడులో నారా భువనేశ్వరి టూర్.. జగన్ సర్కార్‌పై విమర్శలు

Nara Bhuvaneswari

టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు గారి అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. వారందరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజలు ఇచ్చిన ధైర్యం మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి రాగానే ధర్మవరం చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తానని, ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని, చేనేత ముడి సరుకుపై సబ్సిడీ.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి లేక ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this post

submit to reddit
scroll to top