వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తున్న వేళ ఊహించని పరిమాణం ఎదురైంది. పార్టీలో మరోసారి అసంతృప్తి బయటపడింది. తాజాగా మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానం వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను మండలి ఛైర్మన్కు లేఖ రాశారు. తన రాజీనామా లేఖను తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా పంపారు.
జకియా ఖానం 2020 జులైలో గవర్నర కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. గత రెండేళ్లుగా ఆమె పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆమెది అన్నమయ్య జిల్లా రాయచోటి. ఆమెతో కలిపి ఇప్పటివరకు వైసీపీని ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారిలో మర్రి రాజశేఖర్, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఉన్నారు.