ఏపీ రాజధానికి రూ.15వేల కోట్లు.. కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

Chandrababu on Union Budget 2024

కేంద్ర బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయింపులపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. కేంద్రం ముందు తాము ఉంచిన ప్రతిపాదనలకు ఆమోదించినట్లు తెలిపారు. రాజధాని అమరావతికి నిధుల కేటాయింపుల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని , పన్నుల రూపంలో ఏపీకి ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతికి రూ 15 వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని , అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయిస్తాం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు .. నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఏపీకి ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రాజధాని నిర్మాణం పుంజుకుంటుందని చంద్రబాబు అన్నారు.

Share this post

submit to reddit
scroll to top