బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

BRS MLA Prakash Goud Join in Congress

బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది . ఆ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. పీసీసీ అధ్యక్షుడు , సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా చేరనున్నారు. గత జనవరి 28న సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూజోరుగా ప్రచారం కూడా జరిగింది . ఇది మర్యాదపూర్వక సమావేశమని నాడు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే మరికొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.

Share this post

submit to reddit
scroll to top