జగన్‌ను ఓడించడానికి పులివెందుల ప్రజలు సంసిద్ధం

pulivendula btech ravi

 

పులివెందుల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. నియోజకవర్గంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. వేంపల్లిలో మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని కలిసిన ఆయన వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. గత కొన్ని దశాబ్దాలుగా సతీష్ రెడ్డితో కలిసి ఎన్నికల్లో పనిచేశాము. ఈ సారి పులివెందులలో టీడీపీ తరుపున పోటీ చేసే అవకాశం సతీష్ రెడ్డి ద్వారానే వచ్చిందన్నారు. తన గెలుపునకు సతీష్ రెడ్డి తన వంతు సహకారం అందించాలని కోరారు. మరో రెండు మూడు రోజుల్లో కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో సమావేశమై తుది నిర్ణయం వెల్లడిస్తారని రవి వెల్లడించారు.

Share this post

submit to reddit
scroll to top