పొత్తులకు సహకరించండి.. అధికారంలోకి రాగానే పదవులు ఇస్తా.

chandrababu -pawan kalyan

అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తులు ఉన్న నేపథ్యంలో టికెట్ రాని వారు నిరుత్సాహపడొద్దని పార్టీ నేతలకు సూచించారు. పొత్తులకు సహకరించిన వారికి అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారేకే పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. అలాంటి వారికి గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మరో 50 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నందున ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీ సాధికార సభలు స్పందన బాగా వస్తోందన్నారు. రా.. కదిలిరా సభలు ముగిసిన తర్వాత ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. జగన్ పాలనతో విసిగిపోయిన వైసీపీ నేతలు టీడీపీలోకి వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మంచివారు, పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లనే తీసుకుంటున్నాం. అలాంటి చేరికలను ప్రోత్సహించి అందరం కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు.

Share this post

submit to reddit
scroll to top