ఎంత మంది జత కట్టినా.. వైసీపీ టార్గెట్ 175 ఫిక్స్ : సీఎం జగన్

YS Jagan on pawan kalyan

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ 175 ఫిక్స్ చేశారు సీఎం జగన్. ప్రతి పక్షాలన్నీ జత కట్టినా .. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా .. తన పొత్తు ప్రజలతోనే అని స్పష్టం చేశారు. ప్రజలే తమ పార్టీకి స్టార్ క్యాంపెనర్లు అని పేర్కొన్నారు. రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ టీడీపీ-జనసేనపై విమర్శలు కుప్పించారు. తమ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందినవారే తనకు ఓటు వేయిస్తారని చెప్పారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బైట ఉండాలి.. తాగేసిన టీ గ్యాస్ సింక్‌లోనే ఉండాలంటూ పంచ్‌లు విసిరారు. ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త, నాయకులు ఎన్నికలు ముగిసే వరకు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలలో 99 శాతం పూర్తి చేశామని తెలిపారు.

Share this post

submit to reddit
scroll to top