వైసీపీలో చేరిన భారత మాజీ క్రికెటర్

Ambati Rayudu resign to YSRCP

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానన్నారు.

వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి తనకి సీఎం జగన్‌పై మంచి అభిప్రాయం ఉందన్నారు. ఏపీలో కుల,మతాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన చాలా పారదర్శకంగా ఉందని అంబటి రాయుడు ప్రసంశించారు. 2024లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Share this post

submit to reddit
scroll to top