ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు వీరే

BJP candidates list

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా కమలం పార్టీకి 10 సెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు కేటాయించింది. తాజాగా తమ అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ స్థానాలైన అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి – సీఎం రమేష్, రాజమహేంద్రవరం – ఫురందేశ్వరి, నర్సాపురం-భూపతి రాజు శ్రీనివాస వర్మ, తిరుపతి – వరప్రసాదరావు, రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉంటారని బీజేపీ తెలిపింది. అసెంబ్లీ స్థానాలైన అనపర్తి – శివకృష్టంరాజు, ఎచ్చర్ల – ఎన్.ఈశ్వరరావు, విశాఖ నార్త్- పి. విష్ణు కుమార్ రాజు, ధర్మవరం – వై సత్యకుమార్, విజయవాడ వెస్ట్ -సుజనా చౌదరి, కైకలూరు-కామినేని శ్రీనివాసరావు, ఆదోని -పీవీ పార్థసారధి, అరకు – పాంగి రాజారావు, జమ్ములమడుగు – ఆదినారాయణ రెడ్డి, బద్వేలు – బొజ్జా రోషన్నల పోటీ చేయనున్నారు.

Share this post

submit to reddit
scroll to top