జగన్‌ను నమ్మి మోసపోయా.. మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు

Mohan Babu

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పాలనపై ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఇప్పుడు తన పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్లమీద పడినట్లు ఉదన్నారు. సీఎం జగన్‌ను కొంతమంది ఐఏఎస్ అధికారులు పక్కదోవ పట్టిస్తున్నారు. కాలేజీలకు ఇవ్వాల్సిన బకాయిల విషయంతో సరైన న్యాయం జరగలేదన్నారు. సీఎంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగాలేవు అని పేర్కొన్నారు. ఫీజులు తగ్గించడం వల్ల మాడు పగిలిపోతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా.. అయ్యారు. ఈ ఐదేళ్లలో ఒకసారి మాత్రమే ఆయనను కలిశానని చెప్పారు. చంద్రబాబు, రాజశేఖర్‌ రెడ్డి బంధువులే అని పేర్కొన్నారు. రాజకీయాల గురించి పట్టించుకోదలచుకోలేదని అన్నారు.

Share this post

submit to reddit
scroll to top