సీఎం జగన్‌ను నమ్ముకుని గొర్రెల్లాగా మోసపోవద్దు : షర్మిల

YS Sharmila Satires on YS Jagan

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదన్నారు ఏపీఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హోదాను సాధించుకోవాలి అంటే మనం ఉద్యమించాలన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం భుజాన వేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ గారు చెప్పినట్టు గొర్రెల్లాగా ఉండొద్దు.. సింహాల్లా పోరాడాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబును, జగన్‌ను నమ్ముకుని పదేళ్లుగా గొర్రెల్లాగా ఉన్నాం.. ఇక నుంచి అయినా సింహాల్లాగా గర్జించాలన్నారు. ప్రత్యేక హోదా కోసం మనం సింహాల్లా పోరాడి సాధించుకోవాలని పేర్కొన్నారు. అవసరమైతే లాక్కోవాలి.. ప్రతి కాంగ్రెస్ నేత, కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి బీజేపీ, వైసీపీ, టీడీపీ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. బీజేపీతో వారు చేస్తున్న చీకటి పొత్తులను ప్రజలకు వివరించాలి. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని షర్మిల అన్నారు. ఆ మాటతోనే నేను ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టానని చెప్పారు.

Share this post

submit to reddit
scroll to top