ఏపీలో పరిస్థితులు బాగాలేవు.. రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్

YS jagan on cm chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించిన ఆయన ఇటీవల హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించేందుకు రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి అపాయింట్‌మెంట్లు అడుతున్నామని చెప్పారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకంగా వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న సంయుక్త..