తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ

YS Sharmila Meet CM Jagan

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన కుమారుడి నిశ్చితార్థం, వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
ఈ భేటీ సందర్భంగా ఇరువురు మధ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో చేరిన సందర్భంగా ఆమెను అభినందించారు. తెలంగాణ, ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని చర్చించుకున్నట్లు సమాచారం.

ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఆమెకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ పెద్దలతో నా తదుపరి కార్యాచరణపై చర్చించానని తెలిపారు. నాకు ఎలాంటి బాధ్యతతలు అప్పగించినా నమ్మకంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

Share this post

submit to reddit
scroll to top