టీడీపీలోకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి

Magunta Srinivasulu Reddy

ప్రకాశం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. తమ కుటుంబం టీడీపీలో చేరేందుకు సంసిద్ధంగా ఉందని తెలిపారు. మా అబ్బాయి రాఘవరెడ్డితో కలిసి చేరనున్నట్లు ప్రకటించారు. ఏ రోజు చేరాలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఈ సారి ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. రాఘవరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. టీడీపీ , జనసేన, బీజేపీ కలయిక అద్భుతమన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. మూడు పార్టీల నేతలు , కార్యకర్తలు కలిసి పని చేస్తామని తెలిపారు. ప్రకాశం ప్రజలు మాగుంట రాఘవరెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కాగా ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో శ్రీనివాసులు రెడ్డిని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కలిసారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరాలని వారి కుటుంబాన్ని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని మాగుంట వారితో తెలిపారు.

Share this post

submit to reddit
scroll to top