టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ రఘరామకృష్ణరాజు

Raghurama krishnaraju joined in tdp

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాల్లకొల్లు నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామకృష్ణరాజుకు పసుపు కండువా వేసి ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘరామ మాట్లాడుతూ సీఎం జగన్‌పై విమర్శలు కుప్పించారు. సైకో పాలనతో రాష్ట్ర అభివృద్ది కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చొరవతోనే మళ్లీ ప్రజలముందుకొచ్చానన్నారు. చంద్రబాబు, ప్రజల రుణంతీర్చుకుంటానని చెప్పారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించబోతున్నారని పేర్కొన్నారు.

Share this post

submit to reddit
scroll to top